YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఇరు వర్గాల ఘర్షణలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం

ఇరు వర్గాల ఘర్షణలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం

ఇరు వర్గాల ఘర్షణలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం
గుత్తి ఫిబ్రవరి 9,
భుత్వాసుపత్రిలో ఇరువర్గాల మధ్య ఘర్షణపడి , ఇరువర్గాల దాడిలో ఆసుపత్రి ప్రధాన ద్వారం అద్దాలు , తలుపులు ధ్వంసమైన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటుచేసుకుంది.  అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీకి  చెందిన  ఇరు వర్గాల మధ్య  సోమవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది . ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన రామాంజినమ్మ, భూలక్ష్మి లు వరుసకు వదినా , మరదళ్లు గత కొన్ని రోజులుగా వీరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూలక్ష్మిని రామంజనమ్మ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న భూలక్ష్మి కుటుంబ సభ్యులు రామాంజనమ్మ కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం కొట్టుకున్నారు.ఈ గొడవలో  ఇరువర్గాలకు చెందిన భూలక్ష్మి  , రామలక్ష్మి ,  శ్రీనివాసులు , రాజేశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇరువర్గాల వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తిరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దాడిలో ఆసుపత్రి ప్రధాన ద్వారం తలుపులు, అద్దాలు  ధ్వంసమయ్యాయి. ఈ దాడికి , ఘర్షణకు పాల్పడిన ఇరువర్గాలకు చెందిన పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Posts