YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజన్న రాజ్యం తెస్తా..వైఎస్ షర్మిల

రాజన్న రాజ్యం తెస్తా..వైఎస్ షర్మిల

హైదరాబాద్ ఫిబ్రవరి 9  
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మంగళవారం నాడు లోటస్ పాండ్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మాట్లాడుతూ... ’‘ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైఎస్సార్ లేని లోటు ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని అన్నారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై పూర్తి దృష్టిసారిస్తారని.. ఆ తర్వాతే పార్టీపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.  త్వరలోనే 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు పాదయాత్ర నిర్వహిస్తారని కూడా షర్మిల నిర్వహిస్తారని సమాచారం. నల్గొండ జిల్లా కార్యకర్తలతో షర్మిల సమావేశంలో అభిమానులు, కార్యకర్తలు, నేతల నుంచి షర్మిల సలహాలు, సూచనలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానని షర్మిల తెలిపారు.ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ.. నృత్యాలతో సందడి చేశారు.
షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. వైఎస్ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది.

Related Posts