YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కౌంటర్ ఇవ్వరా... సుప్రీం ప్రశ్న

కౌంటర్ ఇవ్వరా... సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9, 
అమరావతి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరిగింది. సిట్‌, కేబినెట్‌ సబ్‌ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులకు టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఆఖరి అవకాశమని.. లేదంటే తాము ప్రొసీడ్ అవుతామని హెచ్చరించింది.కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రతి వాదులు కోరగా.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దమ్మాలపాటి కేసును కూడా అప్పుడే విచారిస్తామన్న సుప్రీంకోర్టు.. ఇప్పటికే హైకోర్టులో ఈ కేసు విచారణను జరపొద్దని చెప్పామని జస్టిస్‌ అశోక్‌భూషణ్ స్పష్టం చేశారు. మార్చి 5న పూర్తి స్థాయి వాదనలు వింటామని తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి 5కి వాయిదా వేసింది.

Related Posts