YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సజ్జల కామెంట్స్ తో మరింత వేడి

సజ్జల కామెంట్స్ తో మరింత వేడి

విజయవాడ, ఫిబ్రవరి 9, 
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా షర్మిల అడుగులేస్తున్న వేళ.. వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. జగన్, షర్మిల మధ్య విబేధాలు లేవన్న ఆయన.. వాళ్లిద్దరి మధ్య ఉన్నది అభిప్రాయ బేధాలు మాత్రమేనన్నారు. వైఎస్ కుటుంబీకులకు పదవులునేది పెద్ద విషయం కాదని.. ఈ విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు వచ్చాయనడం సరికాదన్నారు. షర్మిల పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న విషయం తమకు 2-3 నెలలుగా తెలుసని సజ్జల తెలిపారు.తెలంగాణలోనూ వైఎస్ అభిమానులు చాలా మంది ఉన్నారు. అక్కడా పార్టీని బలోపేతం చేయాలనే భావన చాలా మందిలో ఉంది. కానీ రాష్ట్రం విడిపోయాక వైఎస్సార్సీపీని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం చేయాలని జగన్ బలంగా భావించారు. కానీ తెలంగాణలో పార్టీని విస్తరిస్తే.. అక్కడి రాజకీయ శక్తుల కారణంగా గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయనే జగన్ స్పష్టం చేశారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనూ పార్టీ విస్తరణకు అవకాశాలున్నాయని భావించారు’’ అని సజ్జల తెలిపారు.షర్మిల పార్టీ ఏర్పాటు విషయమై రెండు, మూడు నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం మాకు ముందుగానే తెలుసు. ఇక్కడ చేపడుతున్న సంక్షేమ పథకాలు అక్కడ ఎందుకు తీసుకురావద్దనే ప్రశ్న తలెత్తింది. పార్టీని తెలంగాణలో విస్తరిద్దామన్నప్పుడు.. జగన్ మళ్లీ తన అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.తెలంగాణలో వేరే పార్టీ పెట్టడం అనేది షర్మిల ఆలోచన. దాని వల్ల లాభ నష్టాలు.. ఆటుపోట్ల గురించి కూడా జగన్ తన సోదరి షర్మిలకు చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి తనయ ఆలోచనలు భిన్నంగా ఉన్నంటున్నాయి. ఆమె మాటల్లో అదే వ్యక్తమైంది’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు లేవు. ఇది కేవలం భిన్నాభిప్రాయం మాత్రమే. జగన్ తెలంగాణలో పార్టీ బలోపేతం ఆలోచన వద్దంటున్నారు. కానీ షర్మిల మాత్రం అక్కడ ప్రయత్నిస్తానంటున్నారు. తాను పార్టీ పెట్టినట్టు షర్మిల ఇంకా ప్రకటించలేదు. వైఎస్సార్సీపీ అనేది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైంది. జగన్ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ.జగన్ సహోదరిగా.. వైఎస్సార్సీపీ కోసం పని చేసిన వ్యక్తిగా షర్మిల ఉన్నారు. ఆమె పార్టీ లైన్ దాటితే.. ఆమె ఐడెంటిటీ వేరే అవుతుంది. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో పార్టీ వస్తే.. అక్కడి యాక్టివిటీ వేరు.. ఇక్కడి యాక్టివిటీ వేరు.. దానికి దీనికి సంబంధం ఉండదు.నన్ను నమ్ముకున్న వాళ్లకు (ఏపీ ప్రజలకు) ఏదైనా చేయాలని జగన్ భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా షర్మిల పార్టీ పెడతారని అనే వాదనను నేను అంగీకరించను. గతంలో ఇంతకంటే పెద్దవే జరిగాయి. అన్నా చెల్లెళ్ల మధ్య వ్యక్తిగత విబేధాలు లేవు. తెలంగాణలో పార్టీ విస్తరణ విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.జగన్ ఆలోచనల్లో మార్పు లేదు. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. కానీ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితాలు ఆమెకు మాత్రమే సంబంధించినవి. వైఎస్సార్సీపీలో షర్మిలను ఎదగనీయలేదనేది అవాస్తవం. వైఎస్ ఫ్యామిలీకి పదవుల విషయంలో గొడవలు వస్తాయని అనుకోవడం లేదు. షర్మిలకు పోస్టు ఇస్తే.. కుటుంబ పాలన మీడియా ఆరోపించేది. ముందు నుంచి ప్రజల్లో ఉన్న కుటుంబం అది. జగన్ చెల్లెలిగా.. రాజశేఖర రెడ్డి బిడ్డగా.. ఆమెకు మంచి జరగాలని ఆశిస్తున్నా’’నని సజ్జల వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ నుంచి మరో రాష్ట్రంలోకి వెళ్లి.. పరోక్షంగా లేదా ప్రత్యేకంగా ఎలాంటి ఇతర పార్టీలతో ఎలాంటి సబంధాలు ఉండవు. షర్మిల నిర్ణయం పట్ల జగన్ ఆందోళనతోనే ఉన్నారనుకుంటా. కానీ ఆయన ఆశీస్సులు ఆమెకు ఎప్పుడూ ఉంటాయి. ఆమె రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి సూచనలు ఇవ్వడమనేది ఉండదని సజ్జల స్పష్టం చేశారు

Related Posts