YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

విజయసాయిరెడ్డి క్షమాపణ

 విజయసాయిరెడ్డి క్షమాపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9, 
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై రాజ్యసభలో వైఎస్‌ఆర్సీపీ ఎంపీ, ఆ పార్టీ పార్లమెంట రీ నేత విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై దుమారం రేగడం.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మందలించడంతో విజయసాయి రెడ్డి తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, ఆవేశంలోనే అలా మాట్లాడానని అన్నారు.రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదని అన్నారు. వెంకయ్యనాయుడి పట్ల నా వ్యాఖ్యలకు తీవ్రంగా చింతిస్తున్నానని, ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటిది పునరావృతం కాకుండా చూసుకుంటానని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశం ఇంతటితో ముగిసిందనివెంకయ్యనాయుడు ప్రకటించారు.రాజ్యసభ ఛైర్మన్‌ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు.. ఆయన మనిషి ఒకచోట... మనసు మరోచోట ఉందంటూ విజయసాయి సోమవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోమవారం జీరో అవర్‌లో ఓ సభ్యుడు మాట్లాడిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ విజయసాయిరెడ్డి లేచారు. దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు.. ఏ నిబంధన కింద లేవనెత్తుతున్నారని విజయసాయిని ప్రశ్నించారు.రూల్‌ 238(5), 283(3) ప్రకారం తాను మీ దృష్టికి తీసుకువస్తున్నానని సమాధానం ఇవ్వడంతో విషయం చెప్పండని రాజ్యసభ ఛైర్మన్ సూచించారు. దీంతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఫిబ్రవరి 4న ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చేసిన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.టీడీపీ సభ్యుడు సభలో లేవనెత్తిన అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని ఇక్కడ ప్రస్తావించకూడదని విజయసాయి అన్నారు. మాట్లాడటానికి అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సి ఉన్నా మీరు అది చేయలేదని వ్యాఖ్యానించారు.దీనికి వెంకయ్య బదులిస్తూ..‘ఆ అంశం పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ కిందకి రాదు... మీకున్న అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేస్తే నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైన విషయాలు ఉంటే కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాను. సభ్యులు మాట్లాడేటప్పుడు మాత్రమే పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తడానికి వీలవుతుంది తప్పితే మిగతా సమయాల్లో కాదని’ స్పష్టం చేశారు.టీడీపీ సభ్యులు ఇది వరకు లేవనెత్తిన అంశాలు ఈ సభకు సంబంధించనవి కావంటూ తన ప్రసంగాన్ని విజయసాయిరెడ్డి కొనసాగించబోయారు. ఈ సమయంలో వెంకయ్య జోక్యం చేసుకొని విషయం లోతుల్లోకి వెళ్లొద్దని వారించారు. అయినా సరే విజయసాయి ఆగకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తూ... వెంకయ్యనాయుడిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.అవి రికార్డుల్లోకి వెళ్లవని వెంకయ్యనాయుడు రూలింగ్‌ ఇస్తూ ఇతర సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఛైర్మన్‌పై విజయసాయి పలు రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీనిపై ఇతర పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ జైరాం రమేష్‌, బిజూ జనతాదళ్‌ సభాపక్ష నేత ప్రసన్న ఆచార్యలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇదివరకెన్నడూ ఇలాంటివి చూడలేదని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts