మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఇంద్రకరణ్
నిర్మల్ ఫిబ్రవరి 10,
నాగోబా జాతరకు వెళ్ళుతున్న టీఎస్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మార్గమధ్యలో నిర్మల్ జిల్లా అటవీ కార్యాలయంలో కాసేపు విడిది చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నిర్మల్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, తదితరులు ఉన్నారు.