YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దమ్ముంటే దళితుల సంక్షేమంపై చర్చకు రా..

 దమ్ముంటే దళితుల సంక్షేమంపై చర్చకు రా..

వైఎస్ జగన్‌కు మంత్రి నక్కా సవాల్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు దమ్ముంటే దళితుల సంక్షేమంపై చర్చకు రావాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి నక్కా.. ఇడుపులపాయలో దళితుల భూములు దోచుకున్న చరిత్ర దివంగత నేత వైఎస్‌ కుటుంబానిది అని సంచలన ఆరోపణలు చేశారు. దళితుల భమూల్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి సమాధులు నిర్మించారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహించారు.

అసెంబ్లీలో దళితులు భూములు తిరిగిస్తానని చెప్పిన వైఎస్ మాట ఏమైంది? అని మంత్రి సూటి ప్రశ్న సంధించారు. మహనీయుడు అంబేద్కర్ విగ్రహం పక్కన వైఎస్సార్ విగ్రహం పెట్టడం సిగ్గుచేటు అని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. దళితుల సంక్షేమం కేవలం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, జగన్ మోహన్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి  చూడాల్సిందే.

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు దమ్ముంటే దళితుల సంక్షేమంపై చర్చకు రావాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి నక్కా.. ఇడుపులపాయలో దళితుల భూములు దోచుకున్న చరిత్ర దివంగత నేత వైఎస్‌ కుటుంబానిది అని సంచలన ఆరోపణలు చేశారు. దళితుల భమూల్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి సమాధులు నిర్మించారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహించారు. అసెంబ్లీలో దళితులు భూములు తిరిగిస్తానని చెప్పిన వైఎస్ మాట ఏమైంది? అని మంత్రి సూటి ప్రశ్న సంధించారు. మహనీయుడు అంబేద్కర్ విగ్రహం పక్కన వైఎస్సార్ విగ్రహం పెట్టడం సిగ్గుచేటు అని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. దళితుల సంక్షేమం కేవలం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, జగన్ మోహన్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి  చూడాల్సిందే.

Related Posts