YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి విజయం వంతం చేయాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్

రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి విజయం వంతం చేయాలి    జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్

శుక్రవారం జరిగే రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి విజయం వంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ పిలుపు నిచ్చారు.గురువారం
ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన వ్యవసాయ చట్టాల అమలుతో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) అమలుకు ఏ విధమైన రక్షణ అస్యూరెన్స్ లేక పోవడానికి తోడు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా, నూతన వ్యవసాయ చట్టంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి అస్యూరెన్స్ పొందు పరచలేక పోవటంతో రాబోయే వేసంగి ,రబీ పంటకు సంబంధించి ఇంతవరకు కొనసాగుతున్న, వరి ధాన్యం సేకరణ కేంద్రాలు కొనసాగించటం ప్రశ్నార్థకంగా అనుమానాలు వ్యక్తం చేయటంతో రైతాంగంలో ఏర్పడ్డ ఆందోళన దృష్ట్యా రాష్ట్రంలో రైతాంగం సమస్యల పరిష్కారనిమిత్తం కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలిచే విధంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమాల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క జగిత్యాల జిల్లా సందర్శిస్తున్న సందర్భంగా తేదీ 12- 2- 2021 రోజు సాయంత్రం నాలుగు గంటలకు వెల్గటూర్ మండలం రాజారాం పల్లి గ్రామంలో ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మరియు 13- 2 -2021 రోజున ఉదయం 10 గంటలకు జగిత్యాల మండలం అనంతారం,పోలస గ్రామాల సమీపాన సంఘమిత్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి రైతాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులందరు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ పిలుపు నిచ్చారు.

Related Posts