ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంగీకరించం
విశాఖపట్నం ఫిబ్రవరి 12,
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అచ్చెన్నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ విశాఖకు అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో నోరు తెరవడంలేదని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని.. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.