YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. ఈ నెల 23 న నోటిఫికేషన్? 

త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. ఈ నెల 23 న నోటిఫికేషన్? 

త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. ఈ నెల 23 న నోటిఫికేషన్? 
అమరావతి ఫిబ్రవరి 12 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికలసంఘం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. మార్చి మూడోవారంలో ఎన్నికలు జరుగనున్నాయి.  మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 23 న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది. అయితే కరోనా ఎఫెక్ట్తో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. గతంలో ఎక్కడి నుంచి ఆగిందో .. అక్కడి నుంచే ఎన్నికల ప్రక్రియ కొనసాగించనున్నట్టు సమాచారం. ప్రతిపక్షాలు మాత్రం మళ్లీ కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని కోరాయి. కానీ వాళ్ల విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. వీటిపై ఎన్నికల సంఘం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నది. గతంలో చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం వాటిపై అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా? లేక పాత ప్రక్రియనే తిరిగి కొనసాగిస్తారో? వేచి చూడాలి. ఇప్పటికయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టు సమాచారం. ఎన్నికల సంఘానికి .. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Related Posts