YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రధానిని వదలము - కేటీఆర్ వార్నింగ్

ప్రధానిని వదలము - కేటీఆర్ వార్నింగ్

ప్రధానిని వదలము - కేటీఆర్ వార్నింగ్
కరీంనగర్, ఫిబ్రవరి 12,
తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను సైతం ఉరికించామని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అలాంటిది ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్‌ల బతుకెంత అని కొట్టిపారేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు సీఎం కేసీఆర్‌పై మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ, కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేదని.. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పారిపోయారని చెప్పారు. శుక్రవారంరాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఓపికకు కూడా హద్దు ఉంటుందని, అది దాటితే తాము ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు.‘రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుంది. మా ఓపికను, సహనాన్ని అసమర్థతగా భావించొద్దు. 20 ఏళ్లలో గెలుపోటములను ఎన్నో చూశాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశాం. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ నాయకులను ఆనాడు గంజిలో ఈగల్లాగా ఆంధ్రా నాయకులు తీసిపారేశారు. ఆనాడు మీ బతుకులేందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రాయలసీమ నాయకుల ముందు చేతులు కట్టుకుని నిల్చున్న బతుకులు మీవి. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ఒక్కడన్నా ముందుకొచ్చాడా’’ అని కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు.తెలుగు గడ్డమీద పుట్టిన ప్రాంతీయ పార్టీల్లో బతికి బట్టకట్టినవి రెండే రెండు. ఒకటి టీడీపీ, రెండోది టీఆర్ఎస్. తెలంగాణ సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ట్రం సాధించడంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తోంది. రెండు దశాబ్దాల కిందట తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరాలని కేసీఆర్ సమాలోచనలు చేసి పార్టీని స్థాపించారు. ఆనాడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉండేవారు. ఇంకోవైపు తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు అణగదొక్కిన కాంగ్రెస్, ఒక్కరాష్ట్రం రెండు రాష్ట్రాలని చెప్పి మోసం చేసిన బీజేపీ లాంటి మూడు దిగ్గజ పార్టీలను ఎదిరించి కేసీఆర్ నిలబడ్డారు.’’ అని గుర్తు చేశారు.

Related Posts