అమరావతి ఫిబ్రవరి 13,
ఏపీలో శనివారం రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పదమూడు జిల్లాలు, 18 రెవెన్యూ డివిజన్లు, 167 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. 3,328 పంచాయతీలు, 33,570 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. రెండో విడతలో 539 పంచాయతీలు, 12,605 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2,786 పంచాయతీలు, 20,796 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా పంచాయతీల్లో 7,510 మంది, వార్డుల్లో 44,879 మంది పోటీ చేస్తున్నారు.