YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రధానితో రఘరామ భేటీ

ప్రధానితో రఘరామ భేటీ

ప్రధానితో రఘరామ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13, 
ప్రధాని నరేంద్ర మోదీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పలు కీలక అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. భేటీ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో చర్చించినట్లు తెలిపారు. రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానికి వివరించానని, అక్కడ ఇప్పటికే రూ. 50 వేల కోట్ల పెట్టుబడి పెట్టారని చెప్పినట్లు పేర్కొన్నారు. అమరావతి కోసం న్యాయపరంగా పోరాడుతున్నాం... మీ మద్దతు కూడా కావాలని ప్రధానిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడులపై 25 పేజీల నోట్‌ను ప్రధాని మోదీకి అందజేసినట్లు వెల్లడించారు. హిందూ దేవుళ్లపై పాస్టర్ ప్రవీణ్ వ్యా్ఖ్యలు, అరెస్టుతో పాటు దళితులు.. క్రైస్తవులుగా మారి ఎస్సీ రిజర్వేషన్లు పొందుతుడంపై వివరించినట్లు తెలిపారు. కొన్ని గ్రామాల్లో అధికారికంగా ఒక్క క్రిస్టియన్ లేకపోయినా, పదుల కొద్దీ చర్చిలు ఉన్నాయని వివరించినట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్ల పిలిచిందని రఘురామ.. ప్రధాని మోదీకి తెలిపారు. ఈ విషయం నోట్‌లో ఉందా? అని ప్రధాని ప్రశ్నించగా, ఆ విషయం లేదని.. దీని కోసం ప్రత్యేకంగా ఇస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలోనే చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ టెండర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ సెంటిమెంట్‌, ఆంధ్రుల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని ప్రధాని అన్నారని తెలిపారు. విశాఖ వాసుల సెంటిమెంట్‌ను ప్రధాని కాపాడుతారని నమ్మకం ఉందన్నారు. అలాగే వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కూడా కొన్ని సూచనలు చేసినట్లు వెల్లడించారు. సీఎం జగన్‌ కూడా పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీని కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై విజ్ఞప్తి చేయాలని రఘురామ కృష్ణరాజు సూచించారు.ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రధాని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మోదీతో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని దృష్టికి రఘురామ తెచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని మార్పు మొదలుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దేవాలయాలపై దాడులు ఇలా అనేక విషయాలను ప్రధానికి ఆయన వివరించినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సావదానంగా విన్న ప్రధాని ఒక్క విషయంలో మాత్రం విస్మయానికి గురయ్యారు. అదేంటంటే రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్ల పిలిచిందని రఘురామ, మోదీకి తెలిపారు. దీంతో చర్చిల నిర్మాణానికి టెండర్లా? అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యారని, ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోదీ అన్నారని రఘురామ పేర్కొన్నారు. చర్చిల టెండర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజును మోదీ కోరారు.

Related Posts