YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 గిరిజనులకు అండగా బీజేపీ

 గిరిజనులకు అండగా బీజేపీ

 గిరిజనులకు అండగా బీజేపీ
హైదరాబాద్ ఫిబ్రవరి 15,
కోట్లాది మంది,గిరుజనుల బంజరుల ఆరాధ్య దైవుడు సేవలాల్. సేవలాల్ తెలుగు గడ్డ మీద జన్మించడం గర్వకారణం. సంచార జాతులను ఏకతాటిపైకి తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ముస్లిం రాజుల నుండి ఎంతో ఒత్తిడి వచ్చినా మత మార్పిడి కాలేదు. ధర్మం కోసం,హిందు సంస్కృతి ని పరిరక్షించారు. సేవలాల్ ను స్ఫూర్తి విరుద్ధంగా ఇప్పుడు ఉన్న పాలకులు పాలిస్తున్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం గిరుజనుల భూములను లాక్కొని దౌర్జన్యం చేస్తుంది. టి ఆర్ ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
10 శాతం గిరుజనుల రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. గిరుజనుల రిజర్వేషన్ల పట్ల కేసీఆర్ కి చిత్త శుద్ధి లేదు. గుర్రంపోడు గిరుజనులకు కేటాహీంచన భూములను అన్యాయంగా లాక్కుంటున్నారు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వవలసింది పోయి టి ఆర్ ఎస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు బడా బాబులకు కొమ్ముకాస్తుందని అన్నారు.
ఈ పేద గిరిజనులకు అండగా బీజేపీ ఉంది. బీజేపీ గుర్రంపోడు నుండి యుద్ధం మొదలు పెట్టింది. గిరుజనులు ఓటు బ్యాంకు గా మారుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టి ఆర్ ఎస్ కు బుద్ది చెప్పుతారు. ప్రశ్నించే మహిళలను కుక్కలు అంటున్నారు కేసీఆర్. ఇలాంటి ముఖ్యమంత్రి కా ఓట్లు వేసింది అనుకుంటున్నారు. పొడు భూముల విషయంలో కేసీఆర్ విధివిధానాలు ప్రకటించాలి. తాండలను గ్రామపంచాయితిలగా మార్చి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. గుర్రంపోడు లో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి,అధికారుల పై చర్యలు తీసుకోవాలని అన్నారు. 

Related Posts