మాజీ ఎమ్మెల్యే దీక్ష భగ్నం
విశాఖపట్నం ఫిబ్రవరి 16,
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినా దంతో.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను మంగళవారం తెల్లవారుజా మున పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. అర్థరాత్రి నుంచి శిబిరం వద్ద మోహరించిన పోలీసులు, తెల్లవారు జామున పల్లా శ్రీనివాస్ దీక్షను భగ్నం చేశారు. పల్లాను బలవంతంగా అదుపులోకి తీసుకుని.. షీలానగర్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తరలింపును అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పల్లా శ్రీనివాస్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు విశాఖ పర్యటనకు టీడీపీ అధినేత చంద్ర బాబు రాకముందే పల్లా శ్రీనివాస్ దీక్షను భగ్నం చేయడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.