YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఉపాధ్యాయు రాలు అదృశ్యం.. రూ. కోటికి పైగా అప్పు

ప్రభుత్వ ఉపాధ్యాయు రాలు అదృశ్యం.. రూ. కోటికి పైగా అప్పు

ప్రభుత్వ ఉపాధ్యాయు రాలు అదృశ్యం.. రూ. కోటికి పైగా అప్పు
మంగళగిరి ఫిబ్రవరి 16,

ఎన్ఎస్ఆర్ ప్లాజా అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఝాన్సీరాణి కనిపించటం లేదంటూ ఆమె భర్త వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 11 సాయంత్రం గాలిగోపురం వద్ద బైక్ పార్క్ చేసి వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి కనిపించటం లేదని ఫిర్యాదులో వీరాంజనేయులు పేర్కొన్నారు.

ఝాన్సీరాణి తుళ్లూరు మండలం మందడంలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు మంగళగిరిలో రూ.కోటి కిపైగా అప్పు ఉన్నట్లు గుర్తించారు. ఝాన్సీరాణి తన చరవాణిని కాక మరో నంబరు నుంచి బ్యాంక్ ఖాతాల లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. త్వరలోనే ఝాన్సీరాణి ఆచూకీ కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.

Related Posts