YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కాల్వ‌లోకి దూసుకెళ్లిన బ‌స్సు : 37 మంది మృతి                సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ దిగ్ర్భాంతి

కాల్వ‌లోకి దూసుకెళ్లిన బ‌స్సు : 37 మంది మృతి                సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ దిగ్ర్భాంతి

కాల్వ‌లోకి దూసుకెళ్లిన బ‌స్సు : 37 మంది మృతి
               సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ దిగ్ర్భాంతి
భోపాల్ ఫిబ్రవరి 16
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సిధి జిల్లాలో మంగ‌ళ‌వారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. 60 ప్ర‌యాణికుల‌తో వేగంగా వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి పాట్నా గ్రామం వ‌ద్ద రోడ్డు ప‌క్క‌నే ఉన్న కాలువ‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదం నుంచి ఏడుగురు సుర‌క్షితంగా ఒడ్డుకు చేరారు. ఇప్ప‌టి వ‌ర‌కు  39 మంది మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు వెలికితీశారు. బ‌స్సు నీటిలో పూర్తిగా మునిగిపోవ‌డంతో.. మిగ‌తా వారంద‌రూ గ‌ల్లంతు అయ్యారు. క్రేన్ స‌హాయంతో కాలువ‌లో ప‌డి ఉన్న బ‌స్సును బ‌య‌ట‌కు తీశారు. గ‌ల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. బ‌న్‌సాగ‌ర్ డ్యాం నుంచి కాలువ‌కు నీటి విడుద‌లను ఆపేశారు. ప్ర‌మాదానికి గురైన బ‌స్సు సిధి నుంచి సాత్నా వైపు వెళ్తుండ‌గా.. డ్రైవ‌ర్ అదుపు త‌ప్ప‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. 
సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ దిగ్ర్భాంతి
ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు వేగవంతం చేయాల‌ని ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. 
 

Related Posts