YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కమలం...కామ్ కామ్....

ఏపీలో కమలం...కామ్ కామ్....

విశాఖపట్టణం, ఫిబ్రవరి 17, 
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకు అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి ఇక్కడ ఎదిగే ఛాన్స్ లేకుండా చేస్తుంది. గత ఏడేళ్ల నుంచి ఇదే పరిస్థిితి. ఇప్పటి వరకూ ఏపీ బీజేపీ నేతలు తమ పార్టీ సొంతంగా ఎదగలేకపోవడానికి అనేక కారణాలు చూపుతున్నారు. ఇందులో ప్రధానంగా క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం ఒకటి.ఇక మరొక కారణం చంద్రబాబు పార్టీతో పొత్తు కారణంగా తాము ఎదగలేకపోతున్నామని చెబుతూ వచ్చారు. చంద్రబాబు నీడలో తాము ఎదగలేకపోయామని, ఇక ఆయనను కలుపుకుని అవకాశమే లేదని చెబుతున్నారు. సొంతంగా ఎదుగుతామని చూసుకోవాలని సవాల్ విసురుతున్నారు. జనసేనను కూడా కలుపుకోవడంతో కొద్దో గొప్పో రాష్ట్ర బీజేపీకి ఆశలు పెరిగాయి. టీడీపీని దెబ్బకొట్టి తాము అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే చర్చ కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకూ బీజేపీకి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత బలం ఉన్నట్లు అనిపించింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీకి నాయకత్వమే లేదు. క్యాడర్ కూడా లేకపోవడతో అక్కడ ఎదిగే అవకాశాలు లేవు. అమరావతి రాజధాని విషయంలో బీజేపీ ఆడుతున్న డ్రామాలతో దాదాపు ఐదు జిల్లాల్లో ఆ పార్టీకి డిపాజట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. తిరుపతి ఉప ఎన్నికలో గుప్పిిట మూసి ఉంచినట్లు ఏదో ఉందని భ్రమలు కన్పిస్తున్నా తెరిస్తే ఏమీ ఉండదన్నది అందరికీ తెలిసిందే.ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడంతో ఆ ఎఫక్ట్ ఉత్తరాంధ్రలోనూ పడుతుంది. గతంలో బీజేపీ విశాఖ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇలాంటి నిర్ణయాలతో ఇక భవిష్యత్ లో ఆ అవకాశం కూడా ఉండదు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి చేసేందేమీ లేకపోయినా ఉన్న వాటిని తీసివేస్తూ ప్రజలను బీజేపీకి మరింత దూరం చేస్తున్నారన్నది కాదనలేని వాస్తవం. మరి చూడాలి బీజేపీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఏంచేస్తుందో?
ఇక విశాఖలో మరింత అధ్వాన్నం
విలన్ అంటే ఎక్కడో ఉండరు. బుగ్గ మీసాలు పెట్టుకుని గళ్ల లుంగీ కట్టుకుని కోర చూపులతో భయంకరంగా కనిపించరు. చాలా పొలైట్ గానే ఉంటూ సరైన సమయంలో పక్కన ఉన్న వారినే పోటు పొడుస్తున్నారు. రాజకీయాల్లో ఉండే విలన్లు అంతా అలాంటి వారే. అయితే కొన్ని పార్టీలకు సొంత వారే విలన్లుగా మారుతారు. అలా ఏపీ బీజేపీ నేతలకు కేంద్రంలోని పెద్దలే ఎపుడూ పాపంగా శాపంగా మారుతున్నారు. అందువల్లనే అన్నీ ఉన్నా కమల వికాసం ఏపీలో జరగ‌డం లేదని నేతాశ్రీలు తాపీగా చింతిస్తూ ఉంటారు.కేంద్రంలో మూడు దశాబ్దాల‌ తరువాత పూర్తి మెజారిటీతో మోడీ సర్కార్ 2014 ఎన్నికల్లో ఏర్పడినపుడు ఏపీ నుంచి కూడా చాలా మంది ఆశగా ఆ పార్టీ వైపు చూశారు. నాడు టీడీపీ కాంగ్రెస్, వైసీపీ నుంచి క్యూ కట్టారు కూడా. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో మడత పేచీ పెట్టడమే కాదు విభజన హామీలు తుంగలోకి తొక్కడంతో ఆ పార్టీ మీద ఏపీ జనాలకు ఆగ్రహం పెల్లుబికింది. ఈ పరిణామాలను చూసిన నాయకులు అంతా బీజేపీ లో చేరకపోవడమే బెటర్ అని వెనక్కుతగ్గారు.ఇక 2019 తరువాత ఏపీలో టీడీపీ చిత్తు అయింది. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ నామ రూపాలు లేకుండా పోతే ఆ ప్లేస్ లోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేయాలి కదా. అలా అని ఊరికే టీడీపీ ప్లేస్ లోకి రావడం సాధ్యపడుతుందా. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. బీజేపీకి ఆయనతో వెంటనే ఇబ్బంది కూడా లేదు, అందువల్ల ఏపీ జనాలు కోరినట్లుగా ప్రత్యేక హోదాను ఇచ్చి విభజన హామీలు అమలు చేస్తే కనుక కచ్చితంగా జనాలు టీడీపీ ని మరచిపోయి బీజేపీ వైపే చూసే వారు. ఆలా వైసీపీకి ధీటుగా ఎదిగే చాన్స్ ఉండేది. కానీ బీజేపీ మాత్రం ఏపీకి ఏమీ చేయం అంటూనే బలపడాలని చూడడం రాజకీయ గడుసుతనమే. దాన్ని జనం కూడా గ్రహించారు, వారి కంటే ముందు నాయకులు కూడా అర్ధం చేసుకోబట్టే కమలానికి దూరం అంటున్నారు.ఇక విశాఖలో నాలుగు దశాబ్దాలుగా బీజేపీకి కాస్తో కూస్తో బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా అక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. అటువంటి చోట విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేయడమే బీజేపీ పెద్దలు చేస్తున్న అతి పెద్ద తప్పు అంటున్నారు. ఓవైపు కేంద్ర బడ్జెట్ లో కనీసంగా కూడా ఏపీకి సాయం ఉండదు, పోలవరానికి నిధులు ఇవ్వడానికి కొర్రీలు పెడతారు. మరో వైపు చూస్తే బంగారం లాంటి విశాఖ ఉక్కుని ఏమీ కాకుండా చేయాలని చూస్తారు. మరి ఎందుకు బీజేపీని ఏపీ జనం ఆదరించాలి, నాయకులు అయినా ఎందుకు చేరాలి. ఈ ప్రశ్నలు సొంత పార్టీ వారే వేసుకుంటే అసలైన విలన్ ఎవరో అర్ధమవుతోంది కదా. అవును కేంద్ర పెద్దలకు ఏపీలో బీజేపీ ఎదగడం ఇష్టం ఉన్నట్లుగా లేదు, ఉంటే ఏడేళ్ల తమ ఏలుబడిలో ఏపీకి ఇన్ని తలనొప్పులు తెచ్చిపెడతారా.

Related Posts