YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బాన్సువాడలో కమలం గురి...

బాన్సువాడలో కమలం గురి...

 

బాన్సువాడలో కమలం గురి...
నిజామాబాద్, ఫిబ్రవరి 17,
వరుస విజయాలతో తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ జిల్లాల్లోనూ పార్టీని పటిష్టం చేసేందుకు పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. కాంగ్రెస్ మాజీ మంత్రులు డీకే అరుణ, చంద్రశేఖర్ వంటి సీనియర్ నేతల చేరికలతో బలం పెంచుకుంటున్న బీజేపీ.. ఉమ్మడినిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను మట్టికరిపించిన కాషాయదళం జిల్లాలో కొత్త సమీకరణాలతో దూసుకుపోతోంది.అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ నేతలకు గాలమేస్తోంది. గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటుకు గురైన సీనియర్ నేత మాల్యాద్రి రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైన మాల్యాద్రి రెడ్డి.. ఈ నెల 25న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. నియోజకవర్గంలో కీలకమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతగా ఉన్న మాల్యాద్రి చేరికతో పార్టీకి నూతనోత్తేజం కలిగే అవకాశం ఉంటుందని భావిస్తోంది.బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ చాలా బలహీనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్లు కేవలం మూడు వేలు దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 2998 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. బాన్సువాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బాలరాజుపై సుమారు 18 వేల మెజార్టీతో గెలుపొందారు. పోచారానికి సుమారు 78 ఓట్లు రాగా.. 60 వేల ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ కనీసం పోటీలో కూడా లేదు. నాలుగో స్థానంలో నిలిచిన పిరమిడ్ పార్టీ అభ్యర్థికి, బీజేపీకి వచ్చిన ఓట్లు కంటే కేవలం 500 తక్కువ.రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని దూకుడుపెంచిన బీజేపీ.. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అధికార టీఆర్‌ఎస్‌కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రెడ్‌కార్పెట్ ఆహ్వానం పలుకుతోంది. అందులో భాగంగానే మాల్యాద్రి రెడ్డి చేరికని చెప్పొచ్చు. అయితే 1994 నుంచి ఏకంగా ఏడుసార్లు పోటీ చేసిన పోచారం.. ఒక్క 2004లో వైఎస్ హవాలో ఓటమి చవిచూశారు. గతంలో టీడీపీ నుంచి.. ఆ తర్వాత టీఆర్‌ఎస్ నుంచి వరుస విజయాలు అందుకున్నారు. గత ఏడు పర్యాయాలుగా బాన్సువాడను కంచుకోటగా మలుచుకున్న సీనియర్ నేత పోచారం శ్రీనివాస రెడ్డికి చెక్ పెట్టేందుకే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అసలు బలం లేని చోట కొండకు తాడేసి లాగే ప్రయత్నం చేస్తోన్న కమలం ఏ మేరకు ఫలితాలు రాబడుతుందో వేచిచూడాలి మరి!!

Related Posts