పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి పర్యటన
విజయవాడ ఫిబ్రవరి 17,
టిడిపి హయంలో విజయవాడ నగర అభివృద్దికి చేసింది శూన్యం అని, దోచుకోవడమే ధేయ్యం గా పనిచేశారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగర పర్యటనలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజను నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పర్యటన ప్రారంభించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాగు సెంటర్ అడ్డరోడ్డు అకిలేష్ అనే చిన్నారి చదువుకు పడుతున్న ఇబ్బందిని మంత్రి దృష్టి తీసుకురావ డంతో .. చిట్టినగర్ ప్రయివేట్ పాఠశాల ల్లో చదువుతున్న చిన్నారి చుదువుకు మంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ప్రజలు జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో సంతోషం గా ఉన్నారు.ప్రజలు జగనన్న కు జైజైలు పలుకుతున్నారని,కొన్ని చోట్ల సాంకేతిక కారణంగా ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కారించా లని అధికారులకు సూచించిన్నట్లు తెలిపారు.గత టిడిపి హయంలో 5 సంవత్సరాలు నగర అభివృద్దిని మరిచి దోచుకోవడమే పనిగా పనిచేశారన్నారు.టిడిపి నాయకులు కొండ ప్రాంతంలో కనీసం మెట్లు నిర్మాణం కూడా పూర్తి చేయలేక పోయరన్నారు.ఇప్పడు టిడిపి నాయ కులు జలీల్ఖాన్ తదితరులు గ్రహణం వీడిచినట్లు ప్రజలకు కనిపిస్తున్నార న్నారు.వీరికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.సీఎం జగన్ మెహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు.ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.