కలెక్టర్ పర్యటన
నందికోట్కూరు ఫిబ్రవరి 17,
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో మూడవ విడతలో భాగంగా నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామ పంచాయతీ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సరళిని బుధవారం కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా.పక్కిరప్పతో కలిసి పరిశీలించారు. ఈ . సందర్బంగా ఆయన ఓటరులతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరులు గుంపులు గుంపులుగా లేకుండా వరస క్రమంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నందికొట్కూరు తహసీల్దారు రూప లత, బ్రాహ్మణ కొట్కురు ఎస్ఐ చంద్ర బాబు.అర్ ఐ సత్య నారాయణ,మురళి ఇతర అధికారులు పల్గోన్నారు.