స్పీకర్ తమ్మినేని ఓటు
శ్రీకాకుళం ఫిబ్రవరి 17,
ఏపీలో మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి.శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం తన ఓటును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థల ఎన్నికలు మూలస్థంభం వంటిదని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. స్వగ్రామమైన ఆమదాలవలస మండలం తోగరాంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు శాసనసభాపతి కుటుంబసమేతంగా హాజరై ఓటును తన భార్య తో కలసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో స్థానిక ఎన్నికలు ముఖ్యమని, ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి జరుగు తుందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని పేర్కొన్నా రు. జిల్లాలో జరుగుతున్న మూడవ దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతు న్నాయని తెలిపారు. ప్రజలు, అధికా రుల సమన్వయంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధమని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకో వాలని పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయానికి స్వగ్రామానికి వచ్చి ఓటును వినియోగించుకుంటానని చెప్పారు. ఓటర్ల పిలుపుతో ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం వస్తుందని తమ్మినేని సీతారాం ఆశాభావం వ్యక్తం చేశారు.