డొక్కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనమిచ్చారు
ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ ఫిబ్రవరి 17,
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాడే బులెట్ ఫ్రూప్ వాహనానికి ఛార్జ్ పే చేయాలని పోలీసులు లేఖ రాసారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో బుల్లెట్ ఫ్రూఫ్స్ వాహనాలు వాడుతున్నందున ఛార్జ్ లు పే చేయాలని లేఖలో పేర్కొన్నారు. బులెట్ ఫ్రూప్ వాహనానికి ఛార్జ్ పే చేయాలన్న పోలీసులు తీరును ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పు పట్టారు. ను బులెట్ ఫ్రూప్ వెహికిల్ ఇవ్వమని నేను అడగలేదు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా మీరు వెహికల్ ఇచ్చారు. ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు కూడా మంత్రులు కూడా బులెట్ ఫ్రూఫ్ వాహనాలు వాడుతున్నారు వారు పే చేస్తున్నారా అని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన బీపీ వెహికిల్స్ కండిషన్ కూడా సరిగాలేదు. ఎప్పుడు, ఎక్కడ రోడ్డు మీద అగుతాయే తెలియదని అయన అన్నారు. చంద్రబాబు హయాంలో కొన్న బులెట్ ఫ్రూఫ్ వెహికిల్స్ రిపేర్ చేయించి మాకు అంటగడుతున్నారు. మంత్రులకేమో కొత్త కొత్త వాహనాలు మాకు డోక్కు వాహనాలు ఇస్తారా అని నిలదీసారు.