YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రోడ్డు ప్రమాదాలు తగ్గాయి సీపీ సజ్జనార్

రోడ్డు ప్రమాదాలు తగ్గాయి సీపీ సజ్జనార్

రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
సీపీ సజ్జనార్
హైదరాబాద్ ఫిబ్రవరి 17,
గత  మూడు సంవత్సరాలలో సైబరాబాద్ లో ప్రమాదాలు చాలా తగ్గాయి. వేరే ప్రాంతం వాళ్ళు సైబరాబాద్ పరిధిలోకి రావాలంటే నియమాలు తప్పక పాటించాలి అనే భయం కలిగింది. ఇందుకు మా ట్రాఫిక్ పోలీసులు కృషే కారణమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ యానువల్ కాన్ఫరెన్స్ లో అయన పాల్గోన్నారు. సజ్జనార్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మన పోలీసులు మంచి కృషి చేసారు. ప్రతి ప్రమాదానికి ఒక ఎస్సై స్థాయి అధికారితో దర్యాప్తు చేయిస్తున్నాం. ప్రమాదం చేసి పారిపోయే కేసులు చాలా ఛేదించాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చాలా కార్యక్రమాలు చేపట్టాం. ట్రాఫిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి 10వేల మందికి హెల్మెట్లు ఇప్పించగలిగామని అన్నారు. రోడ్ ఇంజనీరింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైన చోట సిగ్నల్స్ ఏర్పాటు చేయిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ బీజాపూర్ హైవే పై రెండు వాహనాలు ప్రారంభించామని అన్నారు.

Related Posts