పుదుచ్చేరి గవర్నర్ గా తమిళిసై
హైదరాబాద్ ఫిబ్రవరి 17
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తెలంగాణ గవర్నర్ తమిళిసైని నియమించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ నియామక ఆర్డర్ను ఆమె అందుకున్నారు. పుదుచ్చేరి ఎల్జీగా ఉన్న కిరణ్బేడీని మంగళవారం రాత్రి అకస్మికంగా తొలగించారు. కిరణ్ బేడీ స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైని ఎల్జీగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించాలంటూ రాష్ట్రపతి జారీ చేసిన అపాయింట్మెంట్ ఉత్తురులను ఇవాళ తమిళిసై అందుకున్నారు. వారెంట్ అందుకోవడం సంతోషంగా ఉన్నట్లు గవర్నర్ తన ట్విట్టర్లో తెలిపారు. పుదుచ్చేరి రెసిడెంట్ కమీషనర్ ఇవాళ హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైకి అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, గవర్నర్ కిరణ్బేడీ మధ్య చాన్నాళ్ల నుంచి వైరం కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో ప్రజలు సెక్యులర్ పార్టీలను ఇష్టపడుతారని, మతతత్వవాదులకు ఇక్కడ చోటులేదని నారాయణస్వామి అన్నారు.