శత్రుచర్ల వైసీపీకి బైబై....
విజయనగరం, ఫిబ్రవరి 19,
వైసీపీ అంటే రౌడీ రాజకీయం.. రౌడీ రాజకీయం అంటే వైసీపీ. ఈ విషయంలో ఎన్నో కామెంట్స్ ఉన్నయ్. టీడీపీ లీడర్లు.. మిగతా ప్రతి పక్షాలే కాదు. జనంలో కూడా ఈ ఫీలింగ్ ఉంది. కానీ.. బయటికొచ్చి చెప్పే వారు తక్కువే. కామెంట్స్ కూడా ఏ మాత్రం తక్కువేం కాదు. చెప్పని వారు చెప్పకున్నా.. చెప్పే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అలాగే.. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ కూడా ఇవే కామెంట్స్ చేశారు. ఈయన కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు.సింపుల్ గా చెప్పాలంటే.. ఇన్నాళ్లూ వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల రాజీనామా చేశారు. ఇక నేను వైసీపీలో ఉండలేను అన్నారు. ఆయనెవరో కాదు.. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మామ గారే. అయినా సరే.. డిప్యూటీ సీఎం అయితే ఏంటి.. నేను ఈ పార్టీలో ఉండలేను అంటూ రాజీనామా చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి మామ వైసీపీకి రాజీనామా చేయడం అంటే.. హాట్ టాపిక్కే కదా. అయితే.. దానికి మించిన హాట్ టాపిక్కే.. ఆయన చేసిన కామెంట్స్. ఎన్నాళ్లీ రౌడీ రాజకీయం అంటూ నిలదీశారు శత్రుచర్ల. ఏదేదో అనుకుని వచ్ఆచం.. ఇక్కడ అన్నీ దౌర్జన్యాలే నడుస్తున్నాయి అంటూ హాట్ కామెంట్స్ చేశారు చంద్రశేఖర్.అంతేనా... ఇంకా ఎన్నో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల పరిస్థితి ఏంటో కూడా ఆయన మాటల్లో క్లియర్ కట్ గా అర్దం అయింది. ఊర్లళ్లో అంతా దాదాగిరీనే నడిచింది అని సీరియస్ కామెంట్స్ చేశారు శత్రుచర్ల. గ్రామ వాలంటీర్ల దౌర్జన్యం మరికాస్త ఎక్కువే అన్నారు. తాము సపోర్ట్ చేసే వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి ఓటేయకుంటే.. పింఛన్లు లాంటి గవర్నమెంట్ పథకాల నుంచి తీసేస్తాం అంటూ బెదిరించారని కామెంట్స్ చేశారు. స్వయాన తన కుమారుడు కూడా.. రౌడీలా దాడులు చేస్తున్నాడని.. అది తాను భరించలేక పోయాను అన్నారు చంద్రశేఖర్. మేం దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్నాం.. చూస్తున్నాం కానీ.. మరీ ఇంతలా భయానక పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు చంద్రశేఖర్. అందుకే.. ఇవన్నీ చూడలేకే.. తాను రాజీనామా చేస్తున్నట్లు.. వైసీపీ ప్రభుత్వాన్ని పాయింట్ టూ పాయింట్ విమర్శించారు చంద్రశేఖర్. ప్రజలకు మంచి చేయకుండా.. దౌర్జన్యం చేస్తూ పబ్బం గడుపుకునే పార్టీలో తాను ఇకపై ఉండబోను అని క్లారిటీ ఇచ్చారు శత్రుచర్ల.