పంచాయతీ ఎన్నికల ప్రచారం లో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, బి వి
గోనెగండ్ల ఫిబ్రవరి 19,
శుక్రవారంనాడు పంచాయితీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోనెగండ్ల మండలంలోని కున్నూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర మాజీ మంత్రి, జాతీయ టిడిపి ఉపాధ్యక్షుడు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు డా బి వి జయనాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గోన్నారు. అంతకుముందు వారు గ్రామంలోని శ్రీ లింగమయ్యా స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో అందరిని పలకరిస్తూ తిరిగారు. పంచాయితీ ఎన్నికలలో టిడిపి మద్దతిచ్చిన కరువ లక్ష్మీదేవి మంచం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. గ్రామంలో సర్పంచ్, వార్డు మెంబర్లను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.