పార్లమెంట్ రెడ్ స్టోన్ ను పరిశీలించిన మంత్రి వేముల
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 19
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో వినియోగించే స్టోన్ కోసం ఢిల్లీ లోని పార్లమెంట్ భవనం రెడ్ స్టోన్ ను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. దాంతో పాటు ఫౌంటైన్ డిజైన్ కూడా పరిశీలించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈ.ఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్,షాపూర్ జి సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ పలువురు అధికారులు ఉన్నారు.