YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 స్టీల్ ప్లాంట్ వెనుక సీక్రెట్ ప్లాన్ వుంది - యనమల

 స్టీల్ ప్లాంట్ వెనుక సీక్రెట్ ప్లాన్ వుంది - యనమల

 స్టీల్ ప్లాంట్ వెనుక సీక్రెట్ ప్లాన్ వుంది
- యనమల
విజయవాడ
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం కుట్ర సూత్రధారులు ఎ1, ఎ2లే. తన బినామీల మేళ్ల కోసమే స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేందుకు జగన్ ప్రతిపాదన.  మొదట విశాఖ ప్రైవేటు భూములపై, ఆశ్రమ భూములపై గద్దల్లా వాలారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. ఇప్పుడు ఏకంగా స్టీల్ ప్లాంట్ భూములపైనే జగన్ రెడ్డి కన్ను పడింది.  స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం వెనుక సీక్రెట్ ప్లాన్ బినామీల పరం చేయడమే. ఈ కుట్రలో సూత్రధారులు ఎ1 (జగన్మోహన్ రెడ్డి), ఎ 2 (విజయసాయి రెడ్డి), పాత్రధారులు అరబిందో, హెటిరో. ఇప్పటికే కాకినాడ సెజ్, బేపార్క్ తన బినామీల పరం. విశాఖ నగరంలో జె గ్యాంగ్ బెదిరింపులు, సెటిల్మెంట్లు, భూకబ్జాలకు అంతే లేదు. ఇప్పుడిక ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపైనే పడ్డారు.  తన బినామీలకు స్టీల్ ప్లాంట్ భూములను కట్టబెట్టే సీక్రెట్ ప్లాన్ ఇందులో ఉంది. అందులో తొలి అంకమే జగన్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖ అని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్  భూముల అమ్మకం ప్లాన్ జగన్ లేఖలో హిడెన్ అజెండా.  తన చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా భూములు అమ్మించి తన బినామీల పరం చేయాలన్నదే జగన్నాటకం. ‘నేరం నాదికాదు, నా బినామీల భూదాహానిది’’ అన్న ధోరణిలో జగన్ రెడ్డి వ్యవహారం వుందని అన్నారు. 

Related Posts