YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ ఫిబ్రవరి 19  
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా 12 వేలలోపు పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 13 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 13,193 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 1,09,63,394లకు చేరాయి. ఇందులో 1,06,67,741 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా, 1,56,111 మంది కరోనా ప్రభావంతో మరణించారు. మరో 1,39,542 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 97 మంది మరణించగా, కొత్తగా 10,896 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండో డోస్‌ ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,01,88,007 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని వెల్లడించింది.
 

Related Posts