సర్పంచ్ పదవి తో రాజకీయ అవకాశం అభినందనీయం
సర్పంచ్ డొంకల వజ్రమ్మ
నెల్లూరు ఫిబ్రవరి 22
నెల్లూరు జిల్లా, కలువాయి మండలం, పెరంకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కట్టబెట్టి తమ కుటుంబానికి రాజకీయ అవకాశం కల్పించడం అభినందనీయమని దాసరిపల్లి గ్రామ వాస్తవ్యులు, పెరంకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ డొంకల వజ్రమ్మ ధన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గ్రామం లోని స్థానిక ఆమె స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత 20-30 సంవత్సరాలుగా పెరంకొండ గ్రామ పంచాయతీని, ఆ గ్రామానికి చెందిన నాయకులే దక్కించుకునే వారని చెప్పారు. 2021 ఫిబ్రవరి లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ గ్రామానికి పంచాయతీ పదవిని దక్కించుకోవాలనే తపనతో, గ్రామ నాయకులు, గ్రామ ప్రజల సహకారంతో తనకు సర్పంచ్ పదవి రావడం జరిగిందన్నారు. తన విజయం వెనుక ఉన్న గ్రామ నాయకులు కొమ్మి సీనయ్య నాయుడు, రవీంద్ర నాయుడు, శ్రీధర్ నాయుడు, మల్లికార్జున్ నాయుడు, ఈశ్వరయ్య నాయుడు, చంద్రమౌళి నాయుడు తదితర గ్రామ నాయకులతోపాటు రెండు గ్రామాల ప్రజల సహాయ సహకారాలు మరువలేని అన్నారు. స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మండల నాయకులు బుల్లగాకుల అనిల్ కుమార్ రెడ్డి ల సహాయ సహకారాలతో గ్రామానికి సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి తో పాటు, త్రాగునీరు, సాగునీరు సక్రమంగా అదే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ దేవతలైన భద్ర కాలమ్మ, పోలేరమ్మ దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.