వాలంటీర్ వ్యవస్థను తొలగించాలి
జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం ఫిబ్రవరి 22
రాష్ట్రంలో వాలంటీర్లు ను వెంటనే తీసేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన ఆయన నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాది నేని ఉమామహేశ్వరనాయుడు స్వగృహంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధి కాకుండా ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని ఆ వ్యవస్థను వెంటనే తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుప్పం లో కూడా ఎవరిని నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ పూర్తిగా భయబ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.