YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విద్యార్ధులతో షర్మిలా భేటీ

విద్యార్ధులతో షర్మిలా భేటీ

విద్యార్ధులతో షర్మిలా భేటీ
హైదరాబాద్ ఫిబ్రవరి 25
విద్యార్థులతో వైఎస్ షర్మిలా బుధవారం సమావేశం అయ్యారు.  తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకే  మీతో సమావేశం చేసానని వై.యస్.షర్మిల అన్నారు. మీ అక్కగా మన సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను.. తెలుగు ప్రజలను అందరినీ రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దు అని వైఎస్ భరోసా కల్పించారు. ఫీజ్ రిఎంబర్స్ మెంట్ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేది. నేడు ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లంతా ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి నీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్సార్ ది. అక్షరం గుండెల్లో ఇప్పటికీ వైఎస్సార్ బ్రతికే ఉంటారు. ఈ రోజు అందరికీ ఒక మంచి సమాజం కావాలి. తెలంగాణ లో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు. అందరి నిరీక్షణ ఫలించాలి అంటే ఒక మంచి సమాజం రావాలని అన్నారు.

Related Posts