కోల్కతా ఫిబ్రవరి 25
పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణించారు. కోల్కతాలో ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్పై పిలియన్ రైడ్ చేస్తూ ఆఫీసుకు వెళ్లారు. సీఎం కార్యాలయానికి దీదీ స్కూటర్పై వెళ్తున్న దృశ్యాలను అన్ని స్థానిక ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. మరోవైపు ఇవాళ బెంగాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.91కి అమ్ముతున్నారు. ముంబైలో రూ.97కు అమ్ముతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్పీజీ, డీజిల్ ధరలను రోజూ పెంచుతోందని, ఇది ఆందోళన కలిగిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గిస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.