నందిగామాలో నారా లేకేష్ పర్యటన
నందిగామ
నందిగామ లో మాజీ ముఖ్యమంత్రి తనయుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ గురువారం పర్యటించారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సౌమ్య ను పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం సామాజిక కార్యకర్త పసుపులేటి సూర్యప్రకాష్ కుటుంబంపై కొందరు మహిళలు దాడి చేసారు. నైతిక మద్దతు ఇచ్చేందుకు సూర్యప్రకాష్ కుటుంబాన్ని సౌమ్య పరామర్శించారు. సూర్య ప్రకాష్ కుటుంబం పరామర్శించిన సౌమ్య ఇంటి ముందు అదేరోజు కొంతమంది రాద్దాంతం చేసారు. నడిరోడ్డుపై మహిళకు జరిగిన అవమానంపై పరామర్శకు వెళ్లితే తప్పేంటని మా ఇంటి పై దాడి చేయాల్సిన అవసరం ఏంటని ఆమె దీక్షకు కూర్చున్నారు. సౌమ్య చేస్తున్న దీక్షకు మద్దతుగా సౌమ్య ఇంటికి నారా లోకేష్ వచ్చారు. తెలుగుదేశం పార్టీ సౌమ్యకు అండగా ఉంటుందని తెలిపారు.