YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిల వెనుక ప్రశాంత్ కిషోర్!.. రాజకీయవర్గాల్లో చర్చ!

షర్మిల వెనుక ప్రశాంత్ కిషోర్!.. రాజకీయవర్గాల్లో చర్చ!

హైదరాబాద్ ఫిబ్రవరి 26 రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెల్లెలు షర్మిల బాధ్యతను తీసుకున్నారా? ఆమెను తెలంగాణలో బలీయ శక్తిగా మార్చేందుకు రెడీ అయ్యారా? ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల వెనుక పీకే ఉన్నారా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సాగుతోంది.ప్రస్తుతం బెంగళూరు అడ్డాగా రాజకీయ వ్యూహరచన చేస్తున్న షర్మిలకు ప్రశాంత్ కిషోర్ బృందం అండగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు ప్రత్యేక బృందాలు షర్మిలకు సహకరిస్తున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది.ప్రస్తుతం షర్మిల వెంట ప్రశాంత్ కిషోర్ టీం ఉన్నట్టు భోగట్టా. షర్మిల పెట్టబోయే కొత్తపార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ కేంద్రంగా ఒక బృందం పనిచేస్తుండగా.. పార్టీలో చేరికలకు సంబంధించి మరో బృందం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోందని టాక్ నడుస్తోంది. ఈ బృందం షర్మిలకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తోంది. ఈ రెండు బృందాలు కాకుండా ఒక కీలక వ్యక్తి ఆమెకు రాజకీయ శిక్షణ కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.కొత్త పార్టీపై వైఎస్ షర్మిల శూలశోధన చేస్తోంది. వారంలో మూడు రోజులు బెంగళూరులోనూ.. మరో మూడు రోజులు హైదరాబాద్ లోనూ ఆమె కార్యాచరణ కొనసాగుతోంది.ప్రస్తుతం షర్మిలపై రెండు రాష్ట్రాల నిఘా వర్గాలు ఓ కన్నేసినట్లు సమాచారం. దీంతో ఆమెను కలవాలనుకునే నేతలు ఇబ్బంది పడుతున్నారట.. అందుకే గోప్యంగా బెంగళూరు వెళ్లి కలిస్తున్నారు. ఇందుకోసం షర్మిల శుక్ర శని ఆదివారాల్లో బెంగళూరులో ఉంటుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.షర్మిల తన పార్టీని మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ లో భారీ బహిరంగ సభ పెట్టి ప్రకటిస్తారని సమాచారం. అందుకే కార్యకలాపాలు వేగం చేసినట్టు తెలుస్తోంది.

Related Posts