YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

దళితులను మోసం చెయ్యడంలో కెసీర్ తర్వాతే ఎవరైనా : టీపీసీసీ

దళితులను మోసం చెయ్యడంలో కెసీర్  తర్వాతే ఎవరైనా : టీపీసీసీ
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. రిజర్వేష న్ విషయంలోనూ అదే చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పరిపాలన కొనసాగుతుందని టీపీసీసీ నేత గజ్జల కాంతం విమర్శించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు, విద్యార్తులు ఉద్యోగులు,అందరూ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. ఒక్కరు ఉద్యమం చేస్తే వచ్చినది కాదు తెలంగాణ రాష్ట్రం.ఎందరో ప్రాణ త్యాగం చేశారని అయన గుర్తు చేసారు.  తెలంగాణ ఇస్తే ప్రజలకు నీళ్లు,నిధులు ,ఉద్యోగాలు వస్తాయని అందరూ ఆశించారు. రైతాంగం గిట్టుబాటు ధర లేదని రోడ్డు మీదకి వస్తే అక్రమ కేస్ లు పెట్టి జైల్ కి పంపిస్తున్నారు. దళితుల మీద కేసీఆర్ ఉక్కు పాదం మోపారని ఆరోపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. కేసీఆర్ ని,టీఆరెస్ పార్టీ ని ప్రజలు బూ స్థాపితం చేయడానికి సిద్దంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు.? ప్రాజెక్టు ల పెరు మీద వేల కోట్ల కమిషన్ కేసీఆర్ తీసుకుంటున్నారు. తెలంగాణ లో ఉన్న ప్రాజెక్ట్ లన్ని కాంగ్రెస్ హయాంలో కట్టినవని అయన అన్నారు. ప్రాజెక్టు రిడిజైన్ పెరు మీద కమిషన్ తీసుకొని వేిలకోట్లు సంపాదించుకుంటున్నావు. మా హక్కులు మేము అడిగితే మమ్మల్ని అణచివేయలని చూస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలి. పెడరల్ ఫ్రంట్ మీద ఇతర పార్టీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని అయన ఆరోపించారు. 

Related Posts