యువతకు ప్రాధాన్యత
ఎమ్మెల్యే రోజా చిత్తూరు మార్చి 1,
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయ ప్రక్షాళనకోసం మున్సిపల్ ఎన్నికల్లో యువతకు, విద్యావంతులు, మంచివారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా స్పష్టం చేశారు.పుత్తూరు లో జరిగిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగించారు.రాజకీయా లలో కుట్రలు, కుతంత్రాలను చేసే వారిని దూరం చేసి మంచి వారిని గెలిపించాలని కోరారు.పుత్తూరు మునిసిపాలిటీ లో శివాలయం కోనేరు పునరుద్ధరణ, శ్రీ ద్రౌపదమ్మ ఆలయం లో రాజగోపురం నిర్మాణం, పార్క్ ఏర్పాటు, శ్మశానవాటికలో విద్యుత్ క్రిమేషన్ కు ఏర్పాట్లు, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణం, రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులలో గర్బిణిలకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు వంటి ప్రజా సంక్షేఘ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.