నిజామాబాద్ మార్చ్ 1
జిల్లాలోని నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలో ఉన్న పురాతన ఆలయాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభివృద్ధి చేశారు. సుమారు కోటి రూపాయలతో శివాలయాన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ చారిత్రక ఆలయాన్ని సందర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత జిల్లా ప్రజాప్రతినిథులతో కలిసి నిజామాబాద్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి.. హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకు 150 కిలోమీటర్ల మేర స్వాగత తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ ర్యాలీ తో జాతీయ రహదారి 44 కిక్కిరిసిపోయింది.