YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాస అభివృద్ది పనులు ఓటర్లకు వివరించాలి మంత్రి హరీష్ రావు

తెరాస అభివృద్ది పనులు ఓటర్లకు వివరించాలి మంత్రి హరీష్ రావు

హైదరాబాద్
కూకట్ పల్లి నియోజక వర్గం నైనా గార్డెన్ లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం  జరిగింది. సమావేశానికి  మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు ఇతర టీఆరెస్ ముఖ్య నాయకులు హజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మన కూకట్ పల్లి లో 5 లక్షల ఓట్లు ఉన్నాయి ,గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 24 వేల ఓట్లు ఉన్నాయి. కూకట్ పల్లి కార్యకర్తలకు శుభాకాంక్షలు, అభినందనలు.మేయర్ ఎన్నిక లో మీ పాత్ర కీలకం. మొన్నటి ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లకు వివరించాలి. హైదరాబాద్,కూకట్ పల్లి లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగలి అంటే వాణి దేవి ని బారి మెజార్టీ తో గెలిపించుకోవాలని అన్నారు. కూకట్ పల్లి బ్రహ్మాండమైన అండర్ పాస్,ఫ్లై ఓవర్ లు వచ్చాయి. ఇక్కడ 200 కోట్లతో ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే కృష్ణారావు,టీఆరెస్ పార్టీ. కార్యకర్తలను స్వంత అన్నదమ్ములు గా చూసుకునే వ్యక్తి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే బాల నగర్ లో ఎం ఉండే వారానికి మూడు రోజులు ధర్నాలు ఉండే కానీ ఇప్పుడు ఓటీ లు చేస్తున్నారు మన కార్మికులు. పరీక్షలు వస్తే చాలు విద్యార్థులు ఎన్నో అవస్థలు పడేవారు.  తెలంగాణ వచ్చాక ఇన్వర్టర్ లు ,జనరేటర్ లు పోయాయి 24 గంటల కరెంట్ వచ్చింది. మన మంచినీళ్ల పథకం కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టింది. 24 గంటల రైతుల కు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
మొన్న ఈ మధ్యలో బీదర్ పోయాను ,పోతూ పోతూ ఒక్క తండా లో ఆగినను.ఒక్క అక్కను అడిగాను ఎందుకు అక్క ఇక్కడ ఉన్నారు అంటే కరెంట్ వస్తే నీళ్లు పట్టుకుందామని ఉన్నామని అన్నారు. బిజెపి వాళ్ళకు చాలెంజ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రం లో ఏ ఊరుకి అయిన పొదమాని అంటున్నాను మీరు సిద్ధమా  కర్ణాటక లో ఉన్న బీజేపీ రాష్ట్రంలో రైతు బంధు లేదు,రైతు భీమా లేదు. కర్ణాటక కు చెందిన రైతు సంతోష్ వాళ్ళ గ్రామము ను తెలంగాణ లో కలుపుకోండి అన్నారు అంటే అర్థం చేసుకోండి. ప్రశ్నించే గొంతు అంటున్నారు ఎం ప్రశ్నిస్తున్నారు ,ఐటీ ఐ ఆర్ రానందుకు కేంద్రాన్ని ప్రశ్నించండి. ఎందుకు ప్రశ్నిస్తారు డీజల్ ,పెట్రోల్ ,గ్యాస్ పెంచించేందుకు మీ కేంద్ర ప్రభుత్వం కు ప్రశ్నించాలి గ్యాస్,పెట్రోల్,డీజిల్ పెంచినందకు  మీకు ఓటు వేయలా.. పెట్రోల్  పోయించుకునే ముందు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మొన్న బిజెపి వాళ్ళు బడ్జెట్ పెట్టారు అందులో అంత మోసమని అన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ లో మెట్రో రైలు ,బులెట్ ట్రైన్ లు ఇచ్చారు మరి ఇక్కడ కూకట్ పల్లి నుండి ఎందుకో పఠాన్ చెర్ కు పొదగించలేదు. ఉన్న ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఉడకొట్టిన పార్టీ బీజేపీ పార్టీ అని విమర్శించారు. 
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మన చదువు తల్లి సురభి వాణి దేవి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.  సీఎం కేసీఆర్ 7 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.భారతదేశం లోనే సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ నెంబర్ 1 గా ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి లేదు. బిజెపి పాలిత రాష్ట్రాలు,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బంధు,రైతు భీమా ,ఇన్ని సాగునీటి ప్రాజెక్ట్ లు ఉన్నాయా....? తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం. బాల నగర్ లో ఫ్లై ఓవర్ అవుతుంది అని అనుకున్నమా....కానీ ఇప్పుడు అవుతుందని అన్నారు.

Related Posts