విజయవాడ
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికం. చంద్రబాబు నిర్బంధం పౌర స్వేచ్ఛను హరించడమే. చంద్రబాబు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు చంద్రబాబుకు ఉంది. జగన్మోహన్ రెడ్డి చర్యలు హిట్లర్ పాలనను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారారు. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? చర్యకు ప్రతి చర్య తప్పదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని అయన అన్నారు.