YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సంగతి తేల్చాల్చిందే : రాజాసింగ్

జగన్ సంగతి తేల్చాల్చిందే : రాజాసింగ్

హైదరాబాద్, మార్చి 1, 
తెలంగాణ బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి నేరుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే సొంత పార్టీ నాయకులపై సైతం సెటైర్లు వేశారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే హిందువులకు తీవ్ర నష్టమని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గానీ, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ హిందువులకు చేసిన డ్యామేజ్.. చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. ఊళ్లకు ఊళ్లను కన్వర్ట్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే రాష్ట్రంలో గోరక్షణ చేసే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమంగా గోవులను, ఆవు మాంసాన్ని కూడా తెలంగాణకు తరలిస్తున్నారని ఆరోపించారు.ఇవాళ కూడా కడప నుంచి అక్రమంగా ఆవులను రాత్రి పూట వాహనాల్లో తరలిస్తున్నారనే వీడియో ఒకటి తనకు వచ్చిందని రాజాసింగ్ ఆరోపించారు. అలాగే చాలా వరకు కన్వర్షన్లు కూడా ఏపీలోనే జరుగుతున్నాయన్నారు. అలాగే ఆంధ్రాలో గుడులపై దాడులు కూడా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో గుడులపై దాడి చేస్తే.. ఎంత మందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఒక పాస్టర్ ప్లాన్ చేసి గుళ్లపై దాడులు చేయించినా.. కేసును ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారని ప్రశ్నించారు. పాస్టర్ వెనుక ఎంత మంది ఉన్నారో ఇంకా బయటకు రాలేదని, ఫండింగ్ చేస్తున్నది ఎవరు? ఎన్ని గుళ్లు ధ్వంసం చేశారు? ఎంతమందిని చంపారు? అనే వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు.అయితే ఈ విషయాలపై బీజేపీ వాళ్లు ఎందుకు అగ్రెస్సివ్‌గా వెళ్లడంలేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు, అధికారుల మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో తనకు తెలియదని రాజాసింగ్ సెటైర్లు వేశారు. ఏపీలో బీజేపీ వాళ్లకు టార్చర్ ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అయినా కూడా మత మార్పిడులపై ఫైట్ చేస్తున్నామన్నారు. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ వెళ్తానని రాజాసింగ్ వెల్లడించారు. ఏపీలో ధర్మప్రచారం, గోరక్షణ చేస్తాని వ్యాఖ్యానించారు

Related Posts