YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

రాష్ట్ర సాధనలో బంజారాలు కీలక పాత్ర కీలకం: హోం మంత్రి నాయిని

రాష్ట్ర సాధనలో బంజారాలు కీలక పాత్ర కీలకం: హోం మంత్రి నాయిని
రాష్ట్ర సాధనలో బంజారాలు కీలక పాత్ర పోషించారని హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి అన్నారు. గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు తెలంగాణ ప్రభుత్వానికి రవీంద్రభారతిలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి నాయిని, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను పంచాయతీలుగా మార్చామని చెప్పారు. గిరిజన, లంబాడాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.గిరిజన జాతిని దేశంలోనే గర్వంగా బతికేలా చేస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణవైపే చూస్తోందని ఆయ‌న‌ అన్నారు. రూ.5 వేల కోట్లతో గిరిజన గూడేలకు రోడ్లు వేస్తున్నామన్నారు. 2,637తండాలను పంచాయితీలుగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఈటల అన్నారు.

Related Posts