YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ మార్చి 2, 
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్ లు హజర్యారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి 2 విడత ఉచిత  వ్యాక్సిన్ ను ప్రారంభించాం. నిన్న పీఎం మోడీ  వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రజలు అందరూ భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 91 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తారని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా తగిన జాగ్రత్తలు అందరూ పాటించాలి లేకపోతే ఇంట్లో వాళ్లకి ప్రాబ్లమ్ అవుతుంది. ఏడాది క్రితం ఈరోజే  గాంధీ కి మొట్టమొదటి కరోనా పేషెంట్ వచ్చిన రోజు, ప్రాణాలకు తెగించి ఏడాదికాలంగా గాంధీ ఆసుపత్రి కోవిడ్ చికిత్స అందిస్తుంది,అందుకు ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నాం వీటిని వ్యాక్సిన్ ప్రొడక్షన్ బట్టి త్వరలోనే 20 వేలకు పెంచుతాం. ప్రైవేట్ ఆస్పత్రిలో 250 కి మించి వ్యాక్సిన్ పై  వసూలు చేయరాదని అయన అన్నారు.

Related Posts