విజయవాడ మార్చి 2,
కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ప్రచా రం ఉదృతం చేస్తున్నారు.ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు .. ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. కుప్పం పర్యటన లో చంద్రబాబుకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలికారు.చంద్రబాబు నాయుడు చిత్తూరు, తిరుపతి పర్యటనకు వెళ్తుం టే ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాన్నివ్వకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు నేల మీద కూర్చునే పరిస్థితి వైసీపీ తీసుకొచ్చిందని అన్నారు.పంచాయతీ ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలకు ఏ విధంగా పాల్పడ్డారో,మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా దాడులు చేసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ పిరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.