గుంటూరు మార్చి 2,
ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకోవడం అమానుషమని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకునికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని అని నిలదీశారు.టీడీపీ కేంద్ర కార్యాల యం వద్ద నేతల ఆందోళన చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నేతల ఆందోళనకు దిగారు.ఎన్టీఆర్ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆందబాబు, టీడీ జనార్థన్, అశోక్ బాబు టీడీపీ నేతలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు గతంలో రామతీర్థం వెళ్తునపుడు ఇటువంటి పరిస్థితులే సృష్టించారని, ఈచర్యలు అప్రజాస్వామికమని ఆరోపించారు.