మదనపల్లి మార్చి 2,
చిత్తూరు జిల్లా మదనపల్లి లో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నా... తీరా ధర్నా చేసే సమయానికి పోలీసులు వచ్చి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే గ్యాస్ సిలిండర్లు పెట్టి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం రోజుకు ఒక లీటరు పెట్రోల్ చొప్పున ఖర్చు చేసిన నెలకు రూ.18,000 రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపేన చెల్లిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12,000 మాత్రమే సంక్షేమం కింద ప్రతి కుటుంబానికి అందిస్తుందని మిగిలిన 6000 ప్రజల నుంచే రాబటడు తోందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే బీజేపీ వైసీపీ ప్రభుత్వాలకు బుద్ధి చెబుతారన్నారు.