జనగామ మార్చి 2,
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద దానాపూర్ ఎక్స్ప్రెస్ కు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బోగీల నుంచి విడిపోయిన ఇంజన్ ముందుకెళ్లి పోయింది. దాదాపు 500 మీటర్ల తరువాత ఇంజన్ ఆగిపోయింది. ఘటనతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు, సబ్బంది రంగంలోకి దిగి బోగీలను ఇంజన్ వెనక్కు తీసుకువచ్చి బిగించారు. సుమారు గంటపాటు స్టేషన్ ఘన్పూర్ లో బోగీలు నిలిచిపోయాయి.