YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

హర్యానా గురుగ్రామ్‌లో కిరాతకం..

హర్యానా గురుగ్రామ్‌లో కిరాతకం..

22 ఏళ్ల మహిళపై అత్యాచారం...

కార్లోంచి లాగి.. పొదల్లోకి లాక్కెళ్లి...

పది రోజుల్లో పదో ఘటన

హర్యానాలో అత్యాచార పర్వాలకు అడ్డుకట్ట పడటం లేదు. 22 ఏళ్ల మహిళను కార్లో నుంచి బయటకు లాగి.. పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఆదివారం రాత్రి హర్యానాలోని గురుగ్రామ్ సెక్టార్ 57, బిజినెస్ పార్క్ టవర్ వద్ద జరిగిందీ దారుణం. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యానికి హాజరై తిరిగి వస్తుండగా రెండు కార్లలో వచ్చిన మద్యం మత్తులోని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం నిందితుడు సహా ఆ సమయంలో అతడితోపాటు ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, హర్యానాలో పది రోజుల్లో జరిగిన పదో రేప్ ఘటన ఇది. 

ఘటనను కళ్లకు కట్టిన బాధితురాలు...
ఘటనకు సంబంధించిన వివరాలను తన ఫిర్యాదులో వెల్లడించింది బాధితురాలు. ఆదివారం రాత్రి 7 గంటలకు తన భర్త అన్న విందుకు పిలవడంతో తీఘ్ర గ్రామానికి వెళ్లామని, అయితే, విందు ఆలస్యం కావడంతో తమను ఇంటి వద్ద కార్లో దిగబెడతామని తన భర్త చెప్పాడని, ఆ కార్లో ఆరుగురం ఇంటికి బయల్దేరామని ఆమె చెప్పింది. తన భర్త అన్న కొడుకు కారును నడుపుతున్నాడని పేర్కొంది. ‘‘మా బావ ఇంటి నుంచి బయల్దేరిన 15 నిముషాలకు బిజినెస్ పార్క్ టవర్ దాటాం. అయితే, నా భర్త కాస్తంతా విశ్రాంతి కోసం కారును పక్కగా ఆపమన్నాడు. అక్కడ ఆపాక.. మా కారు పక్కగా మరో రెండు కార్లు వచ్చి ఆగాయి. ఆ రెండు కార్లలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. బాగా మద్యం తాగిన ఆ నలుగురు వ్యక్తులు మాతో వాగ్వాదానికి దిగారు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇంతలోనే నా భర్త వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తులు నా భర్త, ఆయన అన్న కుమారుడిపై దాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే కార్లో ఉన్న నాపై వారి దృష్టి పడింది. వారిలో ఒకడు వచ్చి నన్ను బయటకు లాగాడు. అందులోని ఓ వ్యక్తి వద్దని వారించినా అతడు వినలేదు. నన్ను పొదల్లోకి లాక్కెళ్లి.. తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా, ఆ సమయంలో అతడితో పాటు ఉన్న ముగ్గురు యువకులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. రేప్ చేశాక నిందితుడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. వారి కార్ల నంబర్ల ఆధారంగా బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సోహ్నా జోహ్లాకా గ్రామానికి చెందిన నలుగురు యువకులు సంజీత్ (22), ధర్మేందర్ (25), దేశ్‌బీర్ (23), పవన్ (26)లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సంజీత్.. తాను నేరం చేసినట్టు అంగీకరించాడు. 

Related Posts