YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రేషన్ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఏపీ ఎన్నికల సంఘం

రేషన్ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఏపీ ఎన్నికల సంఘం

అమరావతి మార్చ్ 2 ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాల రంగుల మార్పుపై ఏపీ ఎన్నికల సంఘం  వెనక్కి తగ్గింది. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను వెనక్కు తీసుకుంది.. దీంతో పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలని ఎస్ ఈ సీ ఆదేశాలు ఇవ్వగా..దీనిపై ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. వాహనాల రంగులు మార్చాలంటే 3నెలల సమయం పడుతుందని భారీగా ఖర్చవుతుందని.. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది అని కోర్టుకి తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ ఈ సీ ఆదేశాలను సస్పెండ్ చేసింది.

Related Posts